టిమ్స్ వైద్యశాలలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. భూమి పూజ అనంతరం బొల్లారంలో భారీ బహిరంగ సభ
భారీ బందోబస్తు..
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సనత్నగర్, బొల్లారంలో ఏర్పాటు చేసిన బందోబస్తును సీపీ సీవీ ఆనంద్తో పాటు అదనపు సీపీ చౌహాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ పర్యవేక్షించారు.
భారీగా తరలివచ్చిన స్థానికులు..
సికింద్రాబాద్, ఏప్రిల్ 26: బొల్లారంలోని రాజాజీ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్మించనున్న టిమ్స్ వైద్యశాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్వహించిన సభ సక్సెస్ అయ్యింది. ఈ సభకు కంటోన్మెంట్, మల్కాజిగిరి నుంచి భారీగా స్థానికులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు మహిళా నాయకురాలు నివేదిత, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి సభా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సభా ఏర్పాట్లతో పాటు జనసమీకరణలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్, పాండుయాదవ్, నళినికిరణ్, ప్రభాకర్, శ్యామ్కుమార్, స్థానిక నేతలు ముప్పిడి గోపాల్, నర్సింహా ముదిరాజ్, టీఎన్. శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, రాజుసింగ్, ప్రవీణ్ యాదవ్, సురేష్, మురళీయాదవ్, తేజ్పాల్, సరిత, పిట్ల నగేష్ పాలుపంచుకున్నారు.
సభా విశేషాలు..