CM KCR Speech | సీఎం కేసీఆర్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈసందర్భంగా వేడుకకు హాజరయిన క్రిస్టియన్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. 7 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎక్కడుందో అందరికీ తెలుసు అని.. ఇప్పుడు తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,000 ఉందన్నారు.
రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. 3 కోట్ల ధాన్యాన్ని పండించాం. మన ధాన్యాన్ని కొనం అని కేంద్రం అంటుంది. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. యావత్ రాష్ట్రం.. యావత్ ప్రజలు కలిసి కదిలినప్పుడు అద్భుతంగా ముందుకు వెళ్లగలుగుతాం. నిజానికి.. ఇండియా బెస్ట్ కంట్రీ. అసలైన ఇస్లాం మతం ఉన్న దేశానికి వెళ్తే రెండే పండుగలు ఉంటాయి. అసలైన క్రిస్టియన్ మతం ఉన్న దేశాలకు వెళ్తే కూడా ఒకటో రెండో పండుగలు ఉంటాయి. కానీ.. భారతదేశంలో మాత్రం అలా కాదు. భారత్లో నెలకు ఒక పండుగ వస్తుంది. వరుస పండుగలు వస్తుంటాయి. మత భేదం లేకుండా అన్ని మతాల వారు తమ పండుగలను ఎంతో సంతోషంగా మన దేశంలో జరుపుకుంటారు.. అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతిలో ముందుకు వెళ్తున్నాం. భయంకరమైన కరోనా తర్వాత కూడా మనం పెట్టుకున్న లక్ష్యాలను పూర్తి చేసుకోగలిగాం. మధ్యలో కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా.. దేశంలో మొదటి ప్లేస్లో తెలంగాణ ముందుకు దూసుకెళ్తోంది. ఆర్థికంగా పటిష్ఠంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రగతి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తోంది. ఏసు దీవనలతో మన రాష్ట్రం, ఈ దేశం బాగుండాలని నేను కోరుకుంటున్నా. గత సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మిస్ అయ్యాం. భవిష్యత్తులో ఈ మహమ్మారి నుంచి మనమంతా బయటపడాలని క్రిస్మస్ వేడుకల సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను.. అని సీఎం కేసీఆర్ స్పీచ్ ముగించారు.