తెలంగాణ ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు నిర్మల్ జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా నిర్మల్కు చేరుకున్న కేసీఆర్.. తొలుత మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నివాసానికి వెళ్లారు. అంనతరం నిర్మల్-ఖానాపూర్ రహదారి పక్కన కొండాపూర్లో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
తర్వాత నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. నూతన భవనం, డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని ప్రారంభించారు. రూ.166 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీ, రూ.2 కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. రూ.20 కోట్లతో నిర్మించిన మైనార్టీ స్కూల్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, దివాకర్రావ్, దుర్గం చిన్నయ్య, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, కోవలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.