పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 26: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారంలో నూతనంగా ప్రభుత్వం రూ. 900కోట్లతో నిర్మించనన్న టిమ్స్కు సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో నియోజకవర్గంతో పాటుగా మహేశ్వరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ రాకతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది.
భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు హరీశ్రావు, మంత్రి సబితారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ ఆలీ,స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం,దయానంద్ గుప్త, వాణిరావు,జనార్దన్రెడ్డి,ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్ యాద వ్, వెంకటేశ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్త, పరిశ్రమల కార్పొరేషన్చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, కార్పొరేటర్లు నర్సింహగుప్త, రాజశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి,విఠల్రెడ్డి, విఠల్రెడ్డి, రమణారెడ్డి, తిరుమల్రెడ్డి,ప్రవీణ్కుమార్, ప్రకాశ్గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రామ్మోహన్గౌడ్, నాయకులు రాహుల్గౌడ్, మహేశ్యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, చిరంజీవి, అరవింద్రెడ్డి, రవికుమార్గుప్త పాల్గొన్నారు.
ఒంటినిండా అభిమానం
హయత్నగర్/ఎల్బీనగర్, ఏప్రిల్ 26: కొత్తపేట గడ్డిఅన్నారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన (టిమ్స్) శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్పై తన అభిమానం చాటుకునేందుకు ఓ యువ నాయకుడు వినూత్నంగా దర్శనం ఇచ్చాడు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి విశ్వాసపాత్రుడుగా అభిమానిగా ఉన్న హయత్నగర్ డివిజన్ బంజారా కాలనీకి చెందిన శేఖర్ నాయక్ తన ఒంటి నిండా గులాబీ రంగుతో జై కేసీఆర్ అని రాసుకున్నాడు. హయత్నగర్ డివిజన్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడైన శేఖర్ నాయక్ తనకు టీఆర్ఎస్పైన, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఒంటిపై గులాబీ రంగు వేసుకుని కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన తెలిపారు.