ఎల్బీనగర్, మార్చి 29 : దేశానికి ఒక రోల్ మోడల్గా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ఒక విజన్తో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం కర్మన్ఘాట్ శుభం ప్యాలెస్లో ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ న్యాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని అన్నారు. స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రజల ఖాతాలో వేస్తామని చెప్పి ఇంత వరకు ఎందుకు వేయలేదో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. రిజిస్ట్రేషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీవో 118 ద్వారా ఉపశమనం కలిగించామని, అధునాతన టిమ్స్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, చెరువుల సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, ఆస్తి పన్నులను తగ్గించే జీవోను తెప్పించానని ఆయన పేర్కొన్నారు. రూ. 150 కోట్లతో ఆటోనగర్ ప్రాంతాన్ని పూలమొక్కల వనంగా మారుస్తామన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా ఎల్బీనగర్ మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మూడవ సారి విజయం సాధిస్తుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
ఈ సమావేశానికి చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్ గుప్త, అమరవాది లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, ఓరుగంటి వెంకటేశ్, సుంకోజు కృష్ణమాచారి, గజ్జల మధుసూదన్రెడ్డి, చీర శ్రీనివాస్, రోజారెడ్డి, యాదిరెడ్డి, బండారు శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, ఉమా మహేశ్వర్, కట్ట వెంకటేశ్, చేగోని మల్లేశ్గౌడ్, జంగారెడ్డి, ప్రభాకర్, గోపాల్, వెంకటేశ్, అంజిరెడ్డి, దుర్గారెడ్డి, సురేవతర్రెడ్డి, అనసూయ, రమాదేవి, రజిని, ఉష, వసంత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.