కుత్బుల్లాపూర్,సెప్టెంబర్24 : రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. ఆదివారం దూలపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ (పీఏసీఎస్) రెండో బ్రాంచ్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు పీఏసీఎస్ చైర్మన్ గరిశే నరేందర్రాజు, పాలకమండలి సభ్యులతో కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నదన్నారు. కార్యాలయం ప్రారంభం అనంతరం జరిగిన పాలకమండలి సర్వసభ్య సమావేశం బ్యాంకు సీఈఓ టి.కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వార్షిక నివేదికను ఏకగ్రీవంగా తీర్మానించామని పీఏసీఎస్ చైర్మన్ గరిశె నరేందర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మాజీ సర్పంచ్ దేవేందర్, డైరెక్టర్లు బి.సత్యనారాయణ, రవీందర్రెడ్డి, సీహెచ్. మధుసూదన్యాదవ్, నరేందర్, బి.మధుసూదన్, మల్లేశ్, కృష్ణయాదవ్, శ్రీనివాస్యాదవ్, నాగమణి, సావిత్రి, మాధవ్, సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.