వ్యవసాయ యూనివర్సిటీ/బండ్లగూడ/శంషాబాద్ రూరల్, జూన్ 3 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్, శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలోని రైతు వేదికలలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అన్నారు. అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికి అన్నం పెడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రాజేంద్రనగర్ క్లస్టర్లోనే 179 మందికి రూ. 81,93,522 రైతు బంధు అందిందన్నారు. 343 మంది రైతులకు పంట రుణమాఫీ రూ.1,51,04,458 అందిందన్నారు. యాంత్రీకరణ ద్వారా 39 మందికి రూ .21,47,475 లబ్ధిపొందారన్నారు. ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అనేక పథకాలను అందజేశారన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేశారని అన్నారు.
ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్ అర్చనా జయప్రకాశ్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, సహకార సంఘం చైర్మన్ సతీశ్, సర్పంచ్ మాధవి యాదగిరిరెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్యాదవ్, అనిత, డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి, మండలాధ్యక్షుడు కే చంద్రారెడ్డి, సర్పంచ్లు దండుఇస్తారి,రమేష్యాదవ్, రాంగోపాల్,కల్పనసింహరెడ్డి, రైతు బంధుసమితి అధ్యక్షుడు గాదె రాజశేఖర్,రాజశేఖర్గౌడ్,నీరటి రాజు, దిద్యాల శ్రీనివాస్, మైలారంభిక్షపతి, శివాజీ, దర్గా సత్తయ్య,శేఖర్ముదిరాజ్, సురేందర్రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్గౌడ్, కుమార్గౌడ్, మల్లికార్జున్, శ్రీనివాస్, సరికొండ వెంకటేశ్, మల్లేశ్, మహేశ్, శ్రావణ్,షేక్ నయూమొద్దీన్, దోఫిక్, తహసీల్దార్లు చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, ఏవో మల్లారెడ్డి, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.