ఎర్రగడ్డ, నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవాన్ని బోరబండలో ఘనంగా నిర్వహించారు. బోరబండ డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత మోతీనగర్ చౌరస్తా నుంచి బోరబండ వీకర్సెక్షన్ వరకు నిర్వహించిన భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీకర్సెక్షన్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని గోపీనాథ్తో పాటు మల్లేపల్లి లక్ష్మయ్య ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని అమలుపర్చుతూ దళితుల అభ్యున్నతికి సీఎం పాటు పడుతున్నారన్నారు. త్వరలో మరో రెండు చోట్ల అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు పొందిన దేశ ప్రజలకు ప్రశ్నించే హక్కు, ఓటు హక్కు ప్రధానమైనవని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
ఈ హక్కుల ద్వారా తమకు కావాల్సిన వనరులను ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందుతున్నారని వివరించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఏడీ మధు, విజయకుమార్, కృష్ణమోహన్, సిరాజ్, లక్ష్మణ్, బాబూరావు, ధర్మ, సరళ, పద్మ, చంద్రకళ, లక్ష్మణ్గౌడ్, బాబానాయక్, వెంకటేశ్, యూసుఫ్, పవనం కిరణ్కుమార్, బొట్టుశివ, జైభీమ్ యాదగిరి, రమేశ్నాయక్, రాములు, ఆనంద్, రవీందర్, సత్తార్, గౌస్, తిరుపతయ్య, ముత్యాలు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆనంద్నగర్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవతో పాటు పలువురు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మల్లేశ్, శ్రీకాంత్, మహేందర్, రాంచందర్, సదానంద్, ప్రభాకర్, తరుణ్, గంటశ్రీను, రఘు, సత్యయనారాయణ, నర్సింగరావు, సత్తి, రూపేశ్ పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, నవంబర్ 26 : పద్మారావునగర్లోని హమాలీబస్తీలో అంబేద్కర్ మెమోరియల్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ మెమోరియల్ సంఘం అధ్యక్షుడు సుభాశ్, నాయకులు శివప్ప, రవికుమార్, యాదగిరి, శ్యామ్, సంపత్, రాజు పాల్గొన్నారు.