చర్లపల్లి, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ విజయగణపతి ఆలయంలో సుమారు రూ.35లక్షల నిధులతో చేపట్టనున్న ఆలయ ఫ్లోరింగ్, గోశాల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ముఖ్యంగా విజయ గణపతి ఆలయ పాలకవర్గం నాయకులు గోశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. అదేవిధంగా గోశాల నిర్మాణం, ఆలయంలో చేపట్టనున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయనున్న ట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఆలయ పా లకవర్గం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్కుమార్, చెన్నయ్యగౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, అనిల్, నాయకులు గడ్డం రవికుమార్, గిరిక సుధాకర్, సత్తిరెడ్డి, కడియాల బాబు, జాండ్ల వేణుగోపాల్రెడ్డి, పద్మారెడ్డి, కడియాల నందకిశోర్, నవనీత, సూరం శంకర్, తదితరులు పాల్గొన్నారు.