రవీంద్రభారతి, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రవీంద్రభారతిలో వారం రోజుల పాటు కొనసాగిన సీఎం కేసీఆర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముగిసింది. రవీంద్ర భారతి ఆర్ట్ గ్యాలరీలో చిత్ర కారుడు బాలకృష్ణ గీసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. కేసీఆర్ యుగకర్త పేరిట నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో 50కి పైగా పెన్సిల్తో గీసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచగా, వారం రోజులుగా అనేక మంది ఆర్ట్ ఎగ్జిబిషన్ను సందర్శించి సీఎం కేసీఆర్ చిత్రాలను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ చిన్న నాటి నుంచి నేటి వరకు చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి. గురువారం టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంకే బద్రుద్దీన్ రవీంద్రభారతి ఆడిటోరియంలోని ఆర్ట్ ఎగ్జిబిషన్ను సందర్శించి సీఎం కేసీఆర్ చిత్రాలను పరిశీలించి చిత్రకారుడు ఖమ్మం జిల్లాకు చెందిన బాలకృష్ణను అభినందించారు. అనంతరం ఆయనను సన్మానించి యువతలో ఇలాంటి ఆలోచనలు రావాలన్నారు. సీఎం కేసీఆర్ చిత్రాలను చిత్రకారుడు అద్భుతంగా గీసారని కొనియాడారు.