మహేశ్వరం/కందుకూరు, మే 16 : సీఎం కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో మోడల్ స్కూల్లో, గడీకోట మైదానంలో సీఎం కప్ 2023 ఆటల పోటీలను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కప్ ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పినట్లు తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలో త్వరలోనే క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడలల్లో రాణించిన వారికి ప్రభుత్వం తగు సహాయ సహాకారాలను అందిస్తుందన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, తాసీల్దార్ మహమూద్ అలీ, తుక్కుగూడ కమిషనర్ వెంకట్రామ్, నియోజక వర్గ ఉపాద్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, జిల్లా రైతు బంధు సమితి నాయకుడు కూన యాదయ్య, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లచ్యానాయక్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, సర్పంచ్లు మెగావత్ రాజునాయక్, స్లీవారెడ్డి, మోతీలాల్ నాయక్, చంద్రశేఖర్రెడ్డి, మద్ది సురేఖ కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్గౌడ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, నాయకులు మంత్రి రాజేశ్, కంది రమేశ్, ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి, బండారు లింగం, ఏకుల రాములు, కరోళ్ల రాజేశ్, ఎస్టీ సెల్ మండల అద్యక్షుడు గోపాల్నాయక్, బీసీ సెల్ అద్యక్షుడు రాఘవేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.