పహాడీషరీఫ్ : సీఎం సహాయనిధి పేదల పాలిట ఆపన్న హస్తంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్కు చెందిన శ్రీనివాస్ యాదవ్ గత ఆరు నెలల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. ప్రైవేట్ దవాఖానాలో చికిత్స తీసుకున్నాడు.
అధిక ఖర్చు కావడంతో ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆయన కుటుంబ సభ్యులు స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ పుష్ఫమ్మ కొండల్ యాదవ్ సహాయంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. రూ. 57,500లు మంజూరు కావడంతో ఆ చెక్కును బాధితుడు శ్రీనివాస్ యాదవ్కు సోమవారం మంత్రి ఆమె నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పందెం కొండల్ యాదవ్ పాల్గొన్నారు.