– లబ్ది దారునికి ఎల్వోసీని అందజేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
సికింద్రాబాద్ : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భాంధులా మారుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శనివారం టకారబస్తీలోని తన నివాసం వద్ద సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారునికి రూ. 1లక్ష విలువ గల సీఎం సహాయనిధి ఎల్వోసీని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందజేశారు.
అంబర్నగర్కు చెందిన రాంసింగ్ గత కొంత కాలంగా అనారోగ్యం భారిన పడ్డారు. వైద్య ఖర్చుల నిమిత్తం డిప్యూటీ స్పీకర్ను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. దీంతో వైద్య ఖర్చులకు సంబంధించి రూ.1లక్ష ఎల్వోసీని సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయింది. ఈ క్రమంలో లబ్ధిదారునికి ఎల్వోసీని అందించారు.