నేటి నుంచి పట్టణ ప్రగతి
15 రోజులపాటు నిర్వహణ
దోమల నియంత్రణ, వ్యర్థాల తొలగింపు
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తేతెలంగాణ): మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ శుక్రవారం నుంచి 15 రోజులపాటు జరగనుంది. పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నాలాల్లో వరద సాఫీగా సాగడం, దోమల నియంత్రణ, సీజనల్ వ్యాధులు అరికట్టడం, ఫాగింగ్, హరితహారం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. వార్డు కమిటీల బాధ్యులు సమస్యలను గుర్తించి అకడికకడే పరిషారం చూపనున్నారు. ఈ కార్యక్రమం కోసం బల్దియా 3479 మంది సిబ్బందితో 391 బృందాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 461 వాహనాలు సిద్ధం చేసింది.
ఎవరెక్కడ ప్రారంభిస్తారంటే..
1. మంత్రి తలసాని – ఖైరతాబాద్ సీబీఐ క్వార్టర్స్ వద్ద
2. మేయర్ గద్వాల విజయలక్ష్మి – ఎన్బీటీనగర్, జూబ్లీహిల్స్
3. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ – వెంగళ్రావునగర్ డివిజన్ జవహర్నగర్