సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): సమస్యల పరిషారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం మేయర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటిజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ ప్రారంభ కార్యక్రమంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, నోడల్ టీమ్, సరిల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలోని అన్ని సరిళ్ల పరిధిలో 4,846 కాలనీలు ఉన్నాయని, అసోసియేషన్ ప్రతినిధులను నోడల్ టీమ్స్ సభ్యులు కలిసి సమస్యలను తెలుసుకొని యుద్ధప్రాతిపదికన పరిషరిస్తారని చెప్పారు. ఎంటమాలజీ ద్వారా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించాలని కోరారు. హెల్త్ ద్వారా ఆశ, ఏఎన్ఎం వరర్లు వ్యాక్సిన్, సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రేటర్లో 4846 కాలనీలకు గాను 360 నోడల్ టీమ్లను ఏర్పాటు చేశారు. కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలు, సీఅండ్ డీ వేస్ట్, స్ట్రీట్ లైట్లు, వాటర్, సీవరేజీ, మెడికల్, ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్స్, పోలీస్ లా అండ్ ఆర్డర్ తదితర సమస్యలను నోడల్ టీమ్ బృందం పరిషరిస్తారు. ఈ బృందం శుక్రవారం నుంచి 15 రోజుల పాటు బస్తీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్లమ్ లెవల్ ఫెడరేషన్ ప్రతినిధులను మేయర్ కోరారు. ఇంజినీరింగ్, శానిటేషన్, యూబీడీ, వాటర్ వర్స్, వెటర్నరీ, ఎంటమాలజీ, హెల్త్, పోలీస్, ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలకు చెందిన అధికారులు సిబ్బందితో మొత్తం 8 నుంచి 10 మంది వరకు ఉంటారు. ఆర్డబ్ల్యూఏ సూచనలు, సలహాలు తీసుకొని ఇంకా మిగిలిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అకడికకడే పరిషరించేందుకు కృషి చేస్తారు. ఈ సందర్భంగా నగర మేయర్ పబ్లిక్ అండ్ హెల్త్లో ఫెలోషిప్ సాధించిన చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబుకు జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, నోడల్ ఆఫీసర్లు మణిపాల్, నగేశ్, వెటర్నరీ ఆఫీసర్ మోహన్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ మణిపాల్, మెడికల్ ఆఫీసర్ నాగ కార్తిక్, ఏఈలు నగేశ్బాబు, సుష్మ, లక్ష్మి, యూసీడీ డీటీఓ బాలచందర్, లైన్మెన్లు వెంకటేశ్వరరావు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.