అబిడ్స్, ఫిబ్రవరి 7 : నాంపల్లి రెడ్ రోస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సిటీ జాబ్ ఫేర్కు విశేష స్పందన లభించింది. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. డెక్కన్ బ్లాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మన్నన్ఖాన్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి సయ్యద్ ఇర్ఫాన్ ఉద్దీన్ సౌజన్యంతో సిటీ జాబ్ ఫేర్ను నిర్వహించారు.
వివిధ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం దాదాపు 400మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి వారికి నియామక పత్రాలను అందజేశారు. అంతకుముందు ప్రముఖ సంఘసేవకులు ఎస్.రాజేందర్సింగ్ ఠక్రాల్ సిటీ జాబ్ ఫేర్ను ప్రారంభించి ప్రసంగించారు. పుష్ప సినిమా నటుడు రాజ్ తిరణ్ దాసు, ఇంజినీర్ మన్నన్ ఖాన్, రాజేందర్సింగ్ ఠక్రాల్లు ఉద్యోగాలు సాధించిన వారికి ఆఫర్ లెటర్లను అందజేశారు.