సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎలక్షన్ కోడ్ అమలుపై గురువారం నగర ఇన్చార్జి సీపీ (అదనపు సీపీ) విక్రమ్ సింగ్ మాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు నమోదు, శాంతి భద్రతల పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో నేరాలను అదుపు చేయడానికి ముందస్తుగా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా క్షేత్ర స్థాయిలో నిఘాను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎలక్షన్ సెల్ ఇన్చార్జి, డీసీపీ రాధేశ్ మురళీ, లీగల్ అడ్వయిజర్ ఈ.రాములు తదితరులు పాల్గొన్నారు.