సిటీబ్యూరో, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : నగరవాసులు మధురానుభూతులను అందించాలని కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్లు, రిసార్టులు మిరుమిట్లుగొలిపే కాంతుల నడుమ సరికొత్త ఈవెంట్లు నిర్వహించాయి.
ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో నగరానికి చెందిన డీజేలు, సింగర్ గాయత్రీ వేదాంతం, వినీల్ పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. పాటలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ వేడుకలను ఆస్వాదించారు. ఆదివారం రాత్రి 2023కి వీడ్కోలు చెబుతూ.. 2024కి స్వాగతం పలుకుతూ సందడి చేశారు.