జూబ్లీహిల్స్,మే30: పారదర్శక పాలన అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సిటిజన్ ఫ్రెండ్లీ వార్డు కార్యాలయాల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. యూసుఫ్గూడ సర్కిల్లో 5 వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్లో వార్డు కార్యాలయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. యూసుఫ్గూడ డివిజన్లో పీజేఆర్ కమ్యూనిటీ హాలు, వెంగళరావునగర్లో యాదగిరినగర్ కమ్యూనిటీ హాలు, ఎర్రగడ్డలో ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాలుతో పాటు రహ్మత్నగర్, బోరబండ డివిజన్లలో ఆయా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వార్డు కార్యాయాల ఏర్పాటుకు కమ్యూనిటీ హాల్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈఈ రాజ్కుమార్ తెలిపారు. ఆయా కార్యాలయాలలో రూ.26.55 లక్షలతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో 5 వార్డు కార్యాలయాల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.