జవహర్నగర్, జూన్ 13: శామీర్పేట్ మండలం హకీంపేట్లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న 39వ బ్యాచ్, 9వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు 124 (మాజీ సైనికులు) 5 మంది మహిళా అధికారులు, 76 మంది అసిస్టెంట్ కమాండెంట్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విపత్తులను ఎదుర్కోవడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకమని, కమాండోలు అంకితభావంతో దేశానికి సేవలందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
దేశంలోనే క్రమశిక్షణతో కూడిన శిక్షణను సీఐఎస్ఎఫ్ అందజేస్తుండటం అభినందనీయమన్నారు. దేశ రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ కమాండోలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సన్నద్ధతలో నిష్ణాతులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీసా డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్, అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ప్రకాశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నీసా డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఐపీఎస్, అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.