హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా లాలాగూడ పోలీసు స్టేషన్ ఎస్హెచ్వోగా మధులత బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమక్షంలో మధులత బాధ్యతలు స్వీకరించారు. మధులత ఇప్పటి వరకు సౌత్ జోన్ పరిధిలోని పాతబస్తీ ఉమెన్ పోలీసు స్టేషన్లో సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. తనను ఎస్హెచ్వోగా నియమించిన సీపీ సీవీ ఆనంద్కు మధులత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఒక ఎస్హెచ్వోగా మహిళా ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక విమెన్ ఆఫీసర్ను ఎస్హెచ్వోగా నియమించాం. మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు చాలా వరకు తగ్గాయన్నారు. మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.