వికారాబాద్, ఏప్రిల్ 24 : లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్లోని మహిళా పోలీస్స్టేషన్లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించేవారు.
కొన్ని రోజుల క్రితం తాండూరుకు చెందిన ఇర్షాద్ భార్యాభర్తల గొడవ విషయంలో ఇర్షాద్తోపాటు మరో ఐదుగురు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసు ఇచ్చేందుకు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై రాణి రూ.20వేలు లంచం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. లంచం తీసుకున్నారని రుజువు కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.