హైదరాబాద్: నగర శివార్లలోని గాజులరామారంలో కొలువైన చిత్తారమ్మ దేవి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా నిరాడంబరంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
మాస్కు ధరించిన భక్తులనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా కారణంగా ఆలయ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతించడంలేదు. ఏటా సంక్రాంతి మొదటి ఆదివారం నుంచి జరిగే చిత్తారమ్మ దేవి జాతర మొదలైంది.