సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారుతున్నాయి. నిన్నటి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. తాజాగా, పగటి ఉష్ణోగ్రతలు తగ్గి….రాత్రి వేళలో సాధారణం కంటే అధికంగా రెండు డిగ్రీలు పెరిగాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 28.2, కనిష్ఠం 20.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.