కవాడిగూడ/ చిక్కడపల్లి, జనవరి 4: తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదడువాపు వ్యాధి నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న జేఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తల్లదండ్రులకు సూచించారు. ఈ మేరకు నియోజక వర్గంలోని కవాడిగూడ, దోమలగూడ, భోలక్పూర్ యూపీహెచ్సీల పరిధిలోని తొమ్మిది నెలలు నిండిన చిన్నారులకు మెదడు వాపు నివారణ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన వైద్యాధికారులు మనోజ్రెడ్డి, శ్రీనివాస్, మౌనిక, పద్మజలతో కలిసి ప్రారంభించారు. అదే విధంగా దోమలగూడ యూపీహెచ్సీలో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగానే తొమ్మిదేండ్లు నిండిన చిన్నారులకు మెదడు వాపు నివారణ వ్యాక్సిన్ను అందజేస్తున్నదని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు వల్లాల శ్యామ్యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, ఆర్. రాజేశ్, మాణిక్యం మధు, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, రాంచందర్, దుర్గస్వామి, శ్రీనివాస్గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, సాయి, శ్రీకాంత్ముదిరాజ్, రాజా దీన్దయాళ్రెడ్డి, మహ్మద్అలీ, శంకర్గౌడ్, వంగల నర్సింగరావు, రవియాదవ్, భోలక్పూర్ యూపీహెచ్సీ పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట..
దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మె ల్యే ముఠాగోపాల్ అన్నారు. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం 4వ ఆవిర్భావ సభ బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసులు హాజరయ్యారు. సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని వారు ఆవిష్కరించారు. ఈ సమవేశంలో బీఆర్ఎస్ నాయకుడు రావులపాటి మోజస్, నాయకులు చీమ శ్రీనివాస్, కొంపల్లి నరేశ్, సంపూర్ణ, సరస్వతి, చింతల రాములు, యాతాకుల శేఖర్, మహేందర్, మీసాల రాముల, నర్సింగ్రావు పాల్గొన్నారు
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ..
అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ (గృహ కల్ప)మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కలిసి నూతన సంవత్సర శుభాకాక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం.వి జనార్దన్, ఉపాధ్యక్షుడు భిక్షపతి, కార్యనిర్వాహక కార్యదర్శి నసీబ్ బాయి, హరినాథ్, భాగ్లింగంపల్లి, సత్యనారాయణ, వెంకట్రెడ్డి, మన్సూర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.