బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సనత్నగర్ నియోజవర్గంలోని బేగంపేట్, రాంగోపాల్పేట్ డివిజన్లలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్ లో దేవనార్ ఫౌండేషన్ అధ్వర్యంలో కొనసాగుతున్న అంధ విధ్యార్ధుల పాఠశాలలో బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఏర్పాటు చేసిన భారీ కేకును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్లు కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనతంరం విద్యార్ధులతో ముచ్చటించి వారితో సరదాగా గడిపారు. విద్యార్ధులకు కేక్లు, మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో హాజ్ కమిటీ చైర్మన్ మసి ఉల్లాఖాన్, బోయినపల్లి మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ మహ్మద్ అఖిల్ హమ్మద్తో పాటు స్థానిక టీఆర్ఎస్ పార్టీ బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు సురేశ్యాదవ్, శ్రీనివాసగౌడ్, ప్రధాన కార్యదర్శి నరేశ్, నాయకులు శ్రీహరి, శేఖర్ ముదిరాజ్, తాళ్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.