వికలాంగుల ఆసరా పింఛన్ను రూ. 4016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం శామీర్పేట ప్రధాన చౌరస్తా వద్ద క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు, బీఆర్ఎస్ నాయకులు.
– శామీర్పేట, జూలై 23
దివ్యాంగులకు పింఛన్ పెంపుతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం గ్రేటర్వ్యాప్తంగా దివ్యాంగులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ను పెంచిన ముఖ్యమంత్రికి
దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేస్తున్న సుభాష్నగర్ కార్పొరేటర్ హేమలతా సురేశ్ రెడ్డి
-జీడిమెట్ల
దివ్యాంగులకు పింఛన్ పెంపును హర్షిస్తూ ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్
– ఆర్కేపురం
బడంగ్పేట లలితానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి తదితరులు
– బడంగ్పేట
ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో శోభనకాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పలువురు దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో భిక్షపతి, రాము ముదిరాజ్, కీర్తి, శేఖర్, బాగయ్య, సురేందర్
నాయుడు తదితరులు పాల్గొన్నారు.
-బాలానగర్, జూలై 23