కొండాపూర్, జూన్ 22 : వెజ్ సాంబార్ రైస్లో చికెన్ ముక్కలు చూసి వినియోగదారుడు కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ చిరెక్ స్కూల్ దగ్గరలో ఉన్న చైతన్య ఫుడ్ కోర్ట్లో షానవాజ్ సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకుని పార్సిల్ తెచ్చుకున్నాడు. తిందామని సాంబార్ రైస్ డబ్బా తెరిచి చూస్తే .. అందులో పికెల్కి బదులుగా చికెన్ ముక్కలు చూసి షాక్ అయ్యాడు.
నాణ్యతకు కేరాఫ్ అంటూ ప్రకటనలు ఇస్తూ వందల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్న రెస్టారెంట్లే ఇలా చేయడమేంటంటూ వినియోగదారుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనతో పాటు ఉన్న సహా ఉద్యోగి శాకాహారి, అతనికోసం తీసుకొచ్చిన సాంబార్ రైస్లో చికెన్ ముక్కలు వేయడం ఏంటని ప్రశ్నించాడు. ఇలాంటి హోటల్ నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.