బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 19 : వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరాఠా రాజ్యస్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఆదివారం న్యూబోయిగూడలో నిర్వహించారు. జై భవానీ, వీర శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు కైలాశ్, సర్జూ, సాయి, రూపేశ్, సుజీత్, రజత్, సోని, విశాల్, రితేశ్, కౌషిక్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, వెంకటేశన్ రాజు, లంకరాజు, కుశాల్, రాజేందర్లు పాల్గొన్నారు. పద్మారావునగర్లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్కుమార్, ఉపాధ్యక్షురాలు పావనీ, సభ్యులు పాల్గొన్నారు.
జాన్తా రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
అమీర్పేట్, ఫిబ్రవరి 19 : అమీర్పేట్ జాన్తా రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. అమీర్పేట్ ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ వేలాది మంది యువతీ యువకుల నృత్యాలతో అమీర్పేట్ జీహెచ్ఎంసీ మైదానం వరకు కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు గులాబ్సింగ్తో పాటు నిర్వాహకులు ప్రశాంత్, సచిన్, అంకుశ్, మహేశ్, సమీర్, నితిన్, మదన్, అనిల్, రమేశ్లు పాల్గొన్నారు.
జనరల్ బజార్లో ర్యాలీ…
బేగంపేట్ ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ జయంతి ని ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని జనరల్ బజార్లో నిర్వహించారు. తెలంగాణ గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జై శివాజీ అంటూ ఊరేగింపు నిర్వహించారు. మహంకాళి వీధి, సుభాశ్రోడ్డు, బాటా, పాట్ మార్కెట్,మార్కెట్ స్ట్రీట్లోని శివాజీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ పాటిల్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ భారత దేశ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, మహంకాళి ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
బోరబండ డివిజన్లో…
ఎర్రగడ్డ, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ జయంతిని ఆదివారం బోరబండ డివిజన్ ఎస్సార్టీనగర్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీఆర్ఎస్ నేతలు బొట్టుశివ, జైభీమ్ యాదగిరి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ ఆదర్శప్రాయుడని అన్నారు. శివాజీ జయంతి కమిటీ నేత రాము కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో కాశీరాం, వెంకట్రావు, అశోక్, దయానంద్, కమలాకర్, సందీప్, వైద్యనాథ్, ఠాకూర్, శివ, దత్త తదితరులు పాల్గొన్నారు.