మాదాపూర్, మార్చి 10: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తు ముందుకు సాగుతుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ కాలనీలో ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీతో పాటు స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు జీహెచ్ంసీ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజా సమస్యలు, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండటంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతు అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
కాలనీవాసుల కోరిక మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాలనీలో ఇంటింటికి తిరుగుతు సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ యువకులను, రాజస్థాన్, బీహర్ రాష్ర్టాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న యువకులను ఎంపీ రంజిత్రెడ్డి, విప్ గాంధీ పలుకరించగా ఇక్కడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉంటున్నందున సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, శేరిలింగంపల్లి ఎస్సీ సెల్ అధ్యక్షుడు రఘునాథ్, గుమ్మడి శ్రీనివాస్, శ్యామ్, అనీల్, లోకేశ్ పాల్గొన్నారు.
మియాపూర్, మార్చి 10 : ప్రజా సౌకర్యం కోసం లక్షలాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నట్లు ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూస్తానని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రధానంగా మెరుగైన రవాణా వసతి కోసం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్ కాలనీలో రూ.48.50 లక్షలు, కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో రూ.25 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం అర్ధరాత్రి విప్ గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు సమకూర్చుకుంటూ నియోజకవర్గంలో విస్తృతమైన పనులను చేపడుతున్నట్లు, వాటిని ఎప్పటికపుడు పరిశీలిస్తూ తగు సూచనలిస్తున్నట్లు తెలిపారు. అనునిత్యం కాలనీల ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నామన్నారు. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని, తద్వారా పనులలో మరింత నాణ్యత పెరుగుతుందని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారావు, చంద్రారెడ్డి, భగవంత్రెడ్డి, బాల్రెడ్డి, శ్రీను, సోమిరెడ్డి, ప్రతాప్రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.