హైదరాబాద్ : కూకట్పల్లిలోని విజేత సూపర్ మార్కెట్లో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
3 నెలల క్రితం నిర్ణీత గడువు అయిపోయిన లస్సీ అమ్మడంతో చూసుకోక లాస్సి తాగిన ఓంకేశ్ అనే వినియోగదారుడు అస్వస్థతకు గురైయ్యాడు.
ఓంకేశ్ ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు విజేత సూపర్ మార్కెట్లో దాడులు నిర్వహించారు. సూపర్ మార్కెట్లో బొద్దింకలు, ఎలుకలు, కాలం చెల్లిన వస్తువులు ఉన్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. కాగా, బాధితులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.