సిటీబ్యూరో: మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపివేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా ఆదేశించాలంటూ.. సీఎం రేవంత్రెడ్డికి ఎక్స్(ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మెట్రో రైళ్లలో టికెట్ల రేట్లు అధికంగా ఉన్నప్పటికీ నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులపై మరింత భారం పడేలా ఈ నిర్ణయం ఉన్నదని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశీలించి.. మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.