మన్సూరాబాద్, జూలై 3: బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సౌత్ఎండ్ పార్కు కాలనీలో ఉంటున్న వనం చంద్రకళ (55) శనివారం రాత్రి కిరాణాషాపునకు వెళ్లి వస్తుండగా, బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు గొలుసు లాక్కొనే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసి..ఆభరణాన్ని తస్కరించి పారిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.