ఖైరతాబాద్, నవంబర్ 10 : బైక్పై వచ్చిన దుండగులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ హిల్టాప్ కాలనీలోని శ్రీనిలయ అపార్టుమెంట్లో నివసించే వి.నీరజ, కిరణ్ దంపతులు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు షాపింగ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
క్యాబ్ బుక్ చేసేందుకు నీరజ అపార్టుమెంట్ నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో బైక్పై వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.