కూకట్పల్లి : నడుచుకుంటూ వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు వద్ద నుంచి రెండు తులాల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం మేరకు..కుర్ర రాజేష్ (34) అనే నిందితుడు చెడు అలవాట్లు కు బానిసగా మారి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నమోదై ఉన్నాయన్నారు.