సికింద్రాబాద్, డిసెంబర్ 29: కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రక్షణ మంత్రిత్వశాఖకు తెలంగాణ సర్కారు లేఖ రాయడం ఎంతో అభినందనీయమని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి సైదాను ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు విలీన అంశానికి అనుకూలంగా కేంద్రానికి లిఖితపూర్వకంగా లేఖను పంపడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్నకు ధన్యవాదాలు తెలిపారు.