తమ న్యాయమైన హక్కుల కోసం సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు శనివారం నుంచి పనులను బంద్ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ‘పని బంద్’ పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల అసోసియేషన్ ఎల్బీనగర్ అధ్యక్షుడు ఏర్పుల గాలయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ పాష తదితరులు పాల్గొన్నారు.
– ఎల్బీనగర్, మే 15