హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తుల చేతితో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన తన్నీరు మాల్యాద్రి (37) సెంట్రింగ్ కాంట్రాక్టర్గా(Centering contractor) పనిచేస్తూ శేరిలింగంపల్లి తారానగర్లో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. బంధువుల పెళ్లి ఉండడంతో భార్య, పిల్లలు ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మాల్యాద్రి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. మంగళవారం రాత్రి అతని ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది మాల్యాద్రి మర్మాంగాల మీద దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో కలిసి చుట్టుపక్కల జగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో తాగిన మత్తులో ఏమైనా గొడవ జరిగిందా? లేదా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.