కాచిగూడ : రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని సెల్పోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం లాల్దర్వాజ ప్రాంతానికి చెందిన గుడవల్లి అశోక్ (24) విద్యార్థి. జల్సాలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.
దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఇదే క్రమంలో దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన శివసాయి దుర్గాప్రసాద్ (21) ఈ నెల 5న డిగ్రీ పరీక్ష రాయడానికి బర్కత్పురలోని అవంతి కళాశాలకు వచ్చాడు. అక్కడికి వచ్చిన ఇతర విద్యార్థులతో పాటు పది పోన్లను సిబ్బందికి ఇచ్చారు.
ఇదే ఆదునుగా భావించిన అశోక్ లక్ష విలువ చేసే పది సెల్ఫోన్లను తీసుకొని పారిపోయాడు. పరీక్షలు రాసిన అనంతరం పోన్లు తీసుకొవడానికి వచ్చేసరికి పోన్లు కన్పించలేదు. విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా గుడవల్లీ అశోక్ను గురువారం అరెస్ట్ చేసి 9 పోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్సై వీర మల్లయ్య తెలిపారు.