హయత్ నగర్, సెప్టెంబర్ 9 : నేర రహిత సమాజం కోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. గురువారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని మైత్రి మధుర కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు.
కాలనీల్లో పెట్టుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని, నిఘా వ్యవస్థను కాపాడటానికి పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నేరాలు రుజువైతే సరైన శిక్ష పడుతుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, హయత్నగర్ సీఐ సురేందర్ గౌడ్, డీఐ నిరంజన్, ఎస్సైలు శ్రీనివాస రావు, బగ్గయ్య, ఏ ఎస్ ఐ నర్సిరెడ్డి, మైత్రి మధుర కాలనీ అధ్యక్షుడు గూడూరు శ్రీశైలం రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బాలోజీనాయక్, సీసీ కెమెరాలు దాతలు ప్రవీణ్ రెడ్డి. సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.