శంషాబాద్ : నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయని శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపారు. శంషాబాద్ పరిధిలోని నక్షత్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు జరుగుతున్న నేరాలు, అసాంఘీక శక్తుల కార్యకలా పాలు , చోరీ ఘటనలు వేర్వేరు కోణాలలో చోటుచేసుకుంటున్నాయని, వాటిని దర్యాప్తు చేయడంలో,నేరస్థులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తున్నాయని వివరించారు.అన్నీకాలనీలలో తప్పక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.