గౌతంనగర్, మార్చి 22 : నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ల పనితీరును ఎస్సై హరిప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాల పనితీరుపై ఆరాతీశారు. కొత్త వ్యక్తులను నమ్మవద్దని, వారు ఇంటింటికీ తిరిగి పరిచయం చేసుకొని ..మీకు గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, మీ సెల్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడిగి ఖాతా ఖాళీ చేస్తారని, బ్యాంక్ ఖాత వివరాలను ఎవరికి చెప్పవద్దని సూచించారు.
కాలనీలు, బస్తీల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే విషయంపై దృష్టిసారించా లన్నారు. నేరం జరిగినప్పుడు పోలీస్ దర్యాఫ్తులో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడుతాయని, కొన్ని కేసుల విషయంలో నేరం ఎక్కడ జరిగినా క్షణంలో సీసీ కెమెరాల ఫుటేజీల ద్వార నేరస్తులను పట్టేస్తున్నామని, ఈ ఫుటేజీలే సాక్షిగా మారుతున్నాయని తెలిపారు. అపార్టుమెంట్స్, వ్యాపార సముదాయాలు, స్కూళ్లు, కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే వాటి పనితీరును పట్టించు కోవడంలేదని.. వాటిని నిరంతరం పరిశీలిస్తుండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్హిల్స్కాలనీ అధ్యక్షుడు దశరథరెడ్డి, ప్రధాన కా ర్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి భాస్కర్, ఉపాధ్యక్షుడు రమణయ్య, శ్రీహరియాదవ్, హరీశ్పటేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రి అశోక్, విజ య్, మహిళా ప్రతినిధి బొడ్డు పద్మావతి, కాలనీ పెద్దలు రామరాజు, వైవీ రావు, లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ (ఇంజినీరింగ్), తదితరులు పాల్గొన్నారు.