హైదరాబాద్, ఫిబ్రవరి 4 : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయనను 5వ నిందితుడిగా పేర్కొంటూ ఏపీలోని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఈ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ అధికారులు గతంలోనే ఒక చార్జిషీటును దాఖలు చేశారు. మొదటి చార్జిషీటులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరి పేర్లను నిందితులుగా చేర్చారు. రెండో చార్జిషీట్లో దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని నిందితుడిగా పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 17న శివశంకర్రెడ్డిని హైరదాబాద్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.