పోలీసులపై దాడులు చేయాలంటూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినందుకు బీజేపీ నేత, మున్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై పలుకేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్ పీఎస్లో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. పోలీసులపై దాడులు చేయాలని నర్సింహారెడ్డి పోస్టులు చేశారని, పశ్చిమ బెంగాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విధ్వంసానికి ప్రేరేపించారనే అభియోగాలతో ఆయనపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.