బంజారాహిల్స్, డిసెంబర్ 19 : నిషేదిత గుట్కాలను విక్రయిస్తున్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూసఫ్గూడ బస్తీలోని సుధా పాన్షాపులో గుట్కాలు విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు.
షాపులో దాచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులు సయ్యద్ సలీమ్, సయ్యద్ ఇలియాస్లతో పాటు వారికి గుట్కాలు సరఫరా చేసిన శ్రీనివాస రావు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.