హైదరాబాద్ : రాజేందర్నగర్ వద్ద పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బోల్తాపడింది. వేగంగా దూసుకువచ్చిన కారు 120 పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పలువురు స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి దవాఖానకు తరలించారు. కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. అయితే, వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.