హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువతి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద తన కారుతో డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆమెతోపాటు కారులో ఉన్న యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. కారు దూసుకొస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును అక్కడినుంచి స్టేషన్కు తరలించారు. కారు ఫిల్మ్నగర్ వైపు నుంచి చెక్పోస్ట్ వైపు వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిదనే విషయం తెలియాల్సి ఉన్నది.