బంజారాహిల్స్,డిసెంబర్ 24: అనుమానాస్పద స్థితి(Suspicious condition)లో నేపాల్కు చెందిన డ్రైవర్ మృతిచెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్కు చెందిన చట్ బహదూర్ తాపా(47) అనే వ్యక్తి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి వెంకటగిరిలోని ఓ భవనంలోని పెంట్హౌజ్లో గత అరునెలలుగా అద్దెకు ఉంటూ కారు డ్రైవర్(Car driver)గా పనిచేస్తున్నాడు.
కాగా గత మూడురోజులుగా బహుదూర్ తాపా గదిలో ఉండడంతో పాటు ఫోన్ ఎత్తడం లేదంటూ అతడి కుమార్తె ఆదివారం ఉదయం అదే ఇంట్లోని మూడోఫ్లోర్లో ఉంటున్న బంధువు లక్ష్మణ్ తాపాకు ఫోన్ చేసింది. దీంతో లక్ష్మణ్ తాపా పెంట్హౌజ్ వద్దకు వెళ్లి కిటికీ లోంచి చూడగా మంచంమీద బహుదూర్ తాపా మృత దేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనారోగ్యంతో మృతి చెందాడా, లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.