హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ను ధ్వసం చేసింది.అప్పటికీ అగని ఆ కారు.. చెట్టును ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో అందులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో అది ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫుట్పాత్పై ఉన్న క్యాన్సర్ రోగుల సహాయకులు, నిరాశ్రయులు ప్రాన భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు వెల్లడించారు.