కంటోన్మెంట్, ఏప్రిల్ 18: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత చేపట్టిన పాదయాత్రకు అపూర్వస్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న..లాస్యనందిత నినాదాలతో నివేదితకు సంపూర్ణ మద్దతు తెలిపారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి.. దీవెనలు అందించారు.
కంటోన్మెంట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బోయిన్పల్లి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నానగర్, అర్జున్ నగర్, ఇందిరమ్మ నగర్లలో నివేదిత పాదయాత్ర చేశారు. ఏ ఇంటికీ వెళ్లినా జనమంతా ఆమెను అక్కున చేర్చుకొని.. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.